ఆ సినిమా హిట్ అయినా నన్ను ఎవరూ పట్టించుకోలేదు: కరిష్మా

by Disha Web Desk 9 |
ఆ సినిమా హిట్ అయినా నన్ను ఎవరూ పట్టించుకోలేదు: కరిష్మా
X

దిశ, సినిమా: స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో నటించిన ‘సంజు’ మూవీ విజయం సాధించినప్పటికీ తనకు అవకాశాలు రాకపోవడంపై కరిష్మా తన్నా ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ మేరకు 2018లో రిలీజై దాదాపు రూ.100 కోట్లు రాబట్టిన ఈ సినిమాలో తన క్యారెక్టర్‌ ‘పింకీ’కి మంచి మార్కులే పడ్డాయని చెప్పింది. అయితే ఈ విజయం తర్వాత తన కెరీర్ ఊహించినట్లు ముందుకు సాగలేదని, ఒక యేడాదిపాటు పని లేకుండా ఖాళీగానే ఉన్నట్లు తెలిపింది. ‘‘సంజు’లో చిన్న పాత్ర అయినప్పటికీ.. జీవితంలో ముందుకు సాగడానికి నాకు గొప్ప సహాయం చేస్తుందని భావించాను. కానీ.. అలాంటిదేమీ జరగలేదు. ఇదొక నిరుత్సాహపరిచే దశ. కెరీర్‌ ఎదుగుదలకోసం ఇంకా ఏమి చేయాలో అప్పుడు నాకు అర్థం కాలేదు’ అంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది.

Also Read...

ఆవు పేడతో చేసిన డ్రెస్ వేసుకున్న ఉర్ఫీ.. నెట్టింట తీవ్రవిమర్శలు



Next Story

Most Viewed